టీడీపీ నేతలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..

ABN, Publish Date - Sep 06 , 2024 | 08:38 AM

అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలకు, కార్యకర్తలకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ముందు క్రమశిక్షణా రాహిత్యాన్ని ఉపేక్షించబోనని హెచ్చరికలు చేశారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలకు, కార్యకర్తలకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ముందు క్రమశిక్షణా రాహిత్యాన్ని ఉపేక్షించబోనని హెచ్చరికలు చేశారు. గతంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు బరితెగించి లైంగిక వేధింపులు, న్యూడ్ వీడియోలు బయటకు వచ్చినప్పటికీ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే ఆ పార్టీని ప్రజలు మట్టికరిపించారని, ఇప్పుడు అదే పరిస్థితి టీడీపీలోని నేతలపై వస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.


సీఎం చంద్రబాబు తన సహజ శైలికి విరుద్ధంగా వ్యహరించారు. పార్టీ నేతలపై ఆరోపణలు వస్తే.. వారిని పిలిపించి మాట్లాడడం.. మరీ తీవ్రమైన చర్యలు అయితే నోటీసులు ఇవ్వడం జరిగేది. ఆ తర్వాత క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలిపించడం.. వారితో మాట్లాడి చర్యలకుపక్రమించడం అనే సుదీర్ఘ ప్రక్రియ ఉండేది. కానీ అందుకు భిన్నంగా ఈసారి చంద్రబాబు రియాక్టు అయ్యారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆ మహిళ చేసిన ఆరోపణలు, విడుదల చేసిన వీడియోలు మీడియాలో ప్రసారం కాగా.. విషయం తెలుసుకున్న చంద్రబాబు వెంటనే అధికారులను పిలిచి చర్యలకు అదేశించారు. ఆ మహిళ ఫిర్యాదు ఇస్తే ఆదిమూలంపై కేసు నమోదు చేయాలని స్పష్టం చేశారు. మరోవైపు పార్టీ నేతలను పిలిపించి ఆదిమూలంను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

YCP: అధ్యక్ష బాధ్యతలా.. మాకొద్దు బాబోయ్‌..

కౌశిక్ రెడ్డికి బల్మూరి వెంకట్ కౌంటర్..

నటి జత్వానీ కేసులో ట్విస్ట్..

సంచలన విషయాలు బయటపెట్టిన ఆదిమూలం కుమార్తెలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 06 , 2024 | 08:38 AM