ఆదిలాబాద్ జిల్లాపై కాంగ్రెస్ దృష్టి..

ABN, Publish Date - Jun 11 , 2024 | 10:10 AM

హైదరాబాద్: ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌కు కాయకల్ప చికిత్స అవసరమని అధినాయకత్వం భావిస్తోంది. పార్టీని సమన్వయం చేసేందుకు బలమైన నేతకు బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చింది.

హైదరాబాద్: ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌కు కాయకల్ప చికిత్స అవసరమని అధినాయకత్వం భావిస్తోంది. పార్టీని సమన్వయం చేసేందుకు బలమైన నేతకు బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగరరావుకు కేబినెట్‌లో స్థానం కల్పించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్‌ను విస్తరించే పనిలో ఉన్నారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు నేతలు మంత్రివర్గంలో స్థానం కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో ఆశావహుల్లో ఎవరికి నష్టం తెస్తుందోనన్న టెన్షన్ నెలకొంది. ఆదిలాబాద్‌ను కాంగ్రెస్ చేజేతులా చేజార్జుకుంది. విజయావకాశాలు ఉన్నా.. సమన్వయలోపంతో ఓడిపోయినట్లు అధిష్టానం గుర్తించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీతో అంటకాగిన విశాఖ అధికారుల టెన్షన్..

ఐదేళ్లలో గనుల శాఖలో భారీ అవినీతి..

మైనింగ్‌పై ఏపీ ప్రభుత్వం నిఘా...

శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని ఎన్నుకోనున్న కూటమి

బాబు కేబినెట్‌ కూర్పుపై ఉత్కంఠ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 11 , 2024 | 10:10 AM