హైదరాబాద్: నాంపల్లిలో దారుణం..

ABN, Publish Date - Oct 11 , 2024 | 01:57 PM

హైదరాబాద్: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దారుణం చోటు చేసుకుంది. దేవి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కావాలనే ధ్వంసం చేశారని హిందూ సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

హైదరాబాద్: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దారుణం చోటు చేసుకుంది. దేవి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కావాలనే ధ్వంసం చేశారని హిందూ సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ముందుగా కరెంట్ కట్ చేసి.. సీపీ కెమెరాలను పగులగొట్టారు. దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటన స్థలాన్ని అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్ పరిశీలించారు. బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌కు ఆత్మలతో మాట్లాడే అలవాటు ఇంకా పోనట్లుంది

జాయ్ జమీమా దారుణాలు.. వెలుగులోకి వస్తున్న నిజాలు..

సిద్ధిదాయిని అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి

విజయవాడ: మహిషాసురమర్ధినిగా అమ్మవారి దర్శనం..

ఎనిమిదవ రోజుకు చేరుకున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 11 , 2024 | 01:57 PM