దువ్వాడ శ్రీనివాస్ డ్రామాలో కీలక ట్విస్టు..

ABN, Publish Date - Sep 07 , 2024 | 05:29 PM

శ్రీకాకుళం జిల్లా: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ డ్రామాలో కీలక ట్విస్టు చోటు చేసుకుంది. శ్రీనివాస్ భార్య వాణి, కుమార్తెలు ఆందోళన చేస్తున్న నివాసం వద్దకు దివ్వెల మాధురి వచ్చింది. అంతటితో ఆగకుండా రెండో ప్లోర్‌కు వెళ్లి తన సెల్ ఫోన్‌తో వీడియోలు రికార్డు చేశారు.

శ్రీకాకుళం జిల్లా: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ డ్రామాలో కీలక ట్విస్టు చోటు చేసుకుంది. శ్రీనివాస్ భార్య వాణి, కుమార్తెలు ఆందోళన చేస్తున్న నివాసం వద్దకు దివ్వెల మాధురి వచ్చింది. అంతటితో ఆగకుండా రెండో ప్లోర్‌కు వెళ్లి తన సెల్ ఫోన్‌తో వీడియోలు రికార్డు చేశారు. మరోవైపు దివ్వెల మాధురిని ఇంట్లోకి ఎలా రానిస్తారంటూ వాణి, ఆమె కుమార్తెలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు గందరగోళం నెలకొంది.


దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం దాదాపు నెల రోజులగా నడుస్తోంది. శనివారం ఓ శక్తికర పరిణామం చోటు చేసుకుంది. శ్రీనివాస్ అక్రమ సంబంధం కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురి ఈరోజు దువ్వాడ నివాసానికి వచ్చారు. ఆమె రాకతో వివాదం చోటు చేసుకుంది. మాధురి నేరుగా శ్రీనివాస్ ఉంటున్న నివాసానికి వచ్చి రెండో ప్లోర్‌లోకి వెళ్లారు. దాదాపు నెల రోజులుగా వాణి, ఆమె కుమార్తెలు ఆందోళన చేస్తున్నారు. వారిని వీడియో తీసేందుకు మాధురి ప్రయత్నించారు. ఈ క్రమంలో వాణి, ఆమె కుమార్తెలు కూడా ఇంట్లోకి ప్రవేశిస్తామని చెప్పి లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మరి మాధురిని ఎలా లోపలకు అనుమతించారని వాణి పోలీసులను నిలదీశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విజయవాడ వాసులకు మరో చేదు వార్త..

గండ్ల పూడ్చివేత పనులు పరిశీలించిన మంత్రి లోకేష్..

మహాశక్తి గణపతికి తొలిపూజలో సీఎం రేవంత్ రెడ్డి..

ఆ పత్రికపై ఎమ్మెల్యే వసంత ఫైర్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 07 , 2024 | 05:29 PM