చిట్టీలపేరుతో ఘరానా మోసం..

ABN, Publish Date - Oct 16 , 2024 | 12:59 PM

హైదరాబాద్: హైదరాబాద్ జీడిమెట్లలో ఘరానా మోసం వెలుగుచూసింది. చింతల్‌లో చిట్టీల పేరుతో భారీ మోసం జరిగింది. దాదాపు 2 వందల మంది వద్ద సుమారు రూ. 20 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసి పరారయ్యారు.

హైదరాబాద్: జీడిమెట్లలో ఘరానా మోసం వెలుగుచూసింది. చింతల్‌లో చిట్టీల పేరుతో భారీ మోసం జరిగింది. దాదాపు 2 వందల మంది వద్ద సుమారు రూ. 20 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసి పరారయ్యారు. శ్రీ సాయి కాలనీలో నివాసం ఉండే సీతారామయ్య, వరుసకు అల్లుడైన మురళీ కొంత కాలంగా చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేశారు. డబ్బులు తిరిగి ఇచ్చే సమయానికి సీతారామయ్య అనే వ్యక్తి పరారయ్యాడు.


విషయం తెలుసుకున్న బాధితులు చిట్టీ నిర్వాహకుల ఇంటి వద్ద నిరసనకు దిగారు. తమ డబ్బులు తిరిగి ఇస్తామంటూ నమ్మబలికి.. తీరా సమయం వచ్చాక కుటుంబం అంతా డబ్బులతో పరారయ్యారని బాధతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ కూలి పనిచేసి రూపాయి రూపాయి పోగు చేసుకుని చిట్టీలు కట్టామని.. ఇప్పుడు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా సీతారామయ్య, అతని అల్లుడు పారిపోయారని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మామ జగన్ మోహన్ రెడ్డికి అఖిల ప్రియ సవాల్

స్కిల్ కేసులో సీఎం చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్

భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

జాయ్ జమీమా దారుణాలపై నోరు విప్పిన బాధితులు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కీలక సమావేశం నేడు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 16 , 2024 | 12:59 PM