ప్రజావాణిపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

ABN, Publish Date - Jul 18 , 2024 | 09:58 AM

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రజావాణి ఫిర్యాదులకు ట్రాకింగ్ సౌకర్యం కల్పించనుంది. అలాగే ఫిర్యాదు చేసిన తర్వాత జరిగిన పరిష్కారం సరిగా లేదని సదరు ఫిర్యాదుదారు భావిస్తే అపీల్‌కు వెళ్లేందుకు అవకాశం కల్పించనుంది.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రజావాణి ఫిర్యాదులకు ట్రాకింగ్ సౌకర్యం కల్పించనుంది. అలాగే ఫిర్యాదు చేసిన తర్వాత జరిగిన పరిష్కారం సరిగా లేదని సదరు ఫిర్యాదుదారు భావిస్తే అపీల్‌కు వెళ్లేందుకు అవకాశం కల్పించనుంది. అందుకు అవసరమైన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి మంగళ, శుక్రవారాలు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్జీ పెట్టుకుంటున్నారు.

Updated at - Jul 18 , 2024 | 09:58 AM