దారుణం.. రాఖీ కట్టి ఊపిరి వదిలిన అక్క

ABN, Publish Date - Aug 19 , 2024 | 05:40 PM

రాఖీ పండగ వేళ మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో కోన ఊపిరితోనున్న ఓ యువతి తన సోదరులకు రాఖీ కట్టి కన్నుమూసింది. ఈ ఘటన పలువురిని కదిలించింది. నర్సింహులపేట మండలం కోదాడలో పాలిటెక్నిక్ డిప్లొమా చదువుతున్న ఈ యువతిని గత కొంత కాలంగా ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధిస్తున్నాడు.

రాఖీ పండగ వేళ మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో కొన ఊపిరితోనున్న ఓ యువతి తన సోదరులకు రాఖీ కట్టి కన్నుమూసింది. ఈ ఘటన పలువురిని కదిలించింది. నర్సింహులపేట మండలం కోదాడలో పాలిటెక్నిక్ డిప్లొమా చదువుతున్న ఈ యువతిని గత కొంత కాలంగా ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధిస్తున్నాడు. ఆ వేధింపులను తాళ లేక తీవ్ర మనస్థాపంతో ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది.


ఈ విషయాన్ని గమనించిన ఆమె కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి.. ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో తాను రక్షాబంధన్ రోజు వరకు ఉంటానో లేదోనని ఆందోళన వ్యక్తం చేసింది. దాంతో శనివారం రాత్రి తన సోదరులు ఇద్దరిని పిలుపించుకుని.. వారికి రాఖీ కట్టింది. అనంతరం గంట వ్యవధిలోనే ఆమె తుదిశ్వాస విడిచింది.


కళ్ల ముందే తమ కూతురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికులు దీనిని వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లను సైతం ఈ వీడియో కన్నీరు పెట్టిస్తోంది.

Updated at - Aug 19 , 2024 | 05:41 PM