ఏపీలో భారీ వర్షాలు.. అధికారుల హెచ్చరిక..

ABN, Publish Date - Sep 05 , 2024 | 09:10 AM

అమరావతి: బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని విశాఖ వాతావరణ ప్రతినిధులు తెలిపారు. గురువారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

అమరావతి: బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని విశాఖ వాతావరణ ప్రతినిధులు తెలిపారు. గురువారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేయగా.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి 35 కి.మీ. నుంచి 45 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెల్లొద్దని సూచించారు.


కాగా విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎంత వర్షం కురుస్తున్నప్పటికీ వరద బాతులకు సహాయ కార్యక్రమాల్లో ఇటువంటి ఆటంకాలు ఉండకూడదని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రంలోగా బుడమేరు గండ్లను పూడ్చాలని చంద్రబాబు అన్నారు. గండ్లు పూడ్చే పనిని మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వరద బాధితులకు అండగా ABN

మళ్లీ రాత్రి నుంచి కురుస్తున్న వర్షం..

బుడమేరు గండ్లు పూడిక పనులు.. పరిశీలిస్తున్న మంత్రులు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 05 , 2024 | 09:10 AM