విజయవాడ వాసులకు మరో చేదు వార్త..

ABN, Publish Date - Sep 07 , 2024 | 05:02 PM

విజయవాడ: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన విజయవాడకు మరో చేదు వార్త.. నగరంలో పలు ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం పడుతోంది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ వర్షం పడుతుండడంతో బుడమేరు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

విజయవాడ: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన విజయవాడకు మరో చేదు వార్త.. నగరంలో పలు ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం పడుతోంది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ వర్షం పడుతుండడంతో బుడమేరు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. దీంతో ముంపు బాధితులు మరింత ఆందోళన చెందుతున్నారు.


విజయవాడ నగరంలో గంటపాటు కురుస్తున్న వర్షానికి బస్టాండ్, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు బుడమేరు పొంగిన నేపథ్యంలో చాలా ఇళ్లు ముంపుకు గురయ్యాయి. ఇప్పుడు మళ్లీ వర్షం పడుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గండ్ల పూడ్చివేత పనులు పరిశీలించిన మంత్రి లోకేష్..

మహాశక్తి గణపతికి తొలిపూజలో సీఎం రేవంత్ రెడ్డి..

ఆ పత్రికపై ఎమ్మెల్యే వసంత ఫైర్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 07 , 2024 | 05:11 PM