తిరుమల కొండపై హెలికాప్టర్ కలకలం

ABN, Publish Date - Oct 21 , 2024 | 12:35 PM

ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా తిరుమల కొండపై నుంచి హెలీకాఫ్టర్ వెల్లడాన్ని భక్తులు తప్పుబడుతున్నారు. నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి రాకపోకలు సాగించకూడదని స్పష్టంగా ఆగమశాస్త్ర నిబంధనల్లో పేర్కొన్నప్పటికీ తరచూ శ్రీవారి ఆలయంపై హెలీకాఫ్టర్లు వెళ్లడంపై భక్తులు తీవర మనోవేదన వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి: తిరుమల కొండపై హెలికాఫ్టర్ కలకలం రేపింది. శ్రీవారి ఆలయానికి సమీపం నుంచే హెలీకాఫ్టర్ వెళ్లింది. తరచూ తిరుమల కొండపై నుంచే విమానాలు వెళుతున్నాయి. ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా కొండపై నుంచి హెలీకాఫ్టర్ వెల్లడాన్ని భక్తులు తప్పుబడుతున్నారు. నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి రాకపోకలు సాగించకూడదని స్పష్టంగా ఆగమశాస్త్ర నిబంధనల్లో పేర్కొన్నప్పటికీ తరచూ శ్రీవారి ఆలయంపై హెలీకాఫ్టర్లు వెళ్లడంపై భక్తులు తీవర మనోవేదన వ్యక్తం చేస్తున్నారు.


సోమవారం ఉదయం శ్రీవారి ఆలయం సమీపం నుంచి ఓ హెలీకాఫ్టర్ వెళ్లడాన్ని చూసిన భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు శ్రీవారి ఆలయంతో పాటు తిరుమల కొండపై విమానాల రాకపోకలు సాగించవద్దని టీటీడీ అధికారులు ఇప్పటికే పలుమార్లు విమానయాన శాఖకు విజ్ఞప్తి చేసినప్పటికీ.. రేణిగుంట విమానాశ్రయానికి ఉన్న హెవీ ట్రాఫిక్ నేపథ్యంలో తిరుమల కొండపై విమానరాకపోకలు నిలిపివేయలేమని.. అయితే శ్రీవారి ఆలయం సమీపంలో విమాన రాకపోకలు సాగించమని టీటీడీ అధికారులకు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మాజీ మంత్రి విశ్వరూప్ కొడుకు అరెస్ట్..

పోలీసు అమరవీరులకు అమిత్ షా నివాళులు..

రౌడీలకు సీఎం చంద్రబాబు వార్నింగ్‌

అతని బ్యాంక్ ఖాతాల్లో కోట్ల కొద్దీ డబ్బు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 21 , 2024 | 12:35 PM