రంగనాథ్‌పై హైకోర్టు సీరియస్..

ABN, Publish Date - Sep 30 , 2024 | 01:37 PM

హైడ్రా బాధితుల పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరయ్యారు. వర్చువల్‌గా హైకోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. ఆదివారం రోజు ఎందుకు కూల్చివేతలు చేశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించింది. పత్రికలు చెప్పినట్లు వింటున్నారా లేక లా ఫాలో అవుతున్నారా అని నిలదీసింది.

హైదరాబాద్: హైడ్రాపై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కమిషనర్ రంగనాథ్‌పై సీరియస్ అయింది. ఆదివారం సెలవు దినాల్లో కూడా ఇళ్లు ఎలా కూల్చేస్తారంటూ ప్రశ్నించింది. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని.. హైడ్రాకు ఉన్న చట్టబద్ధతను కూడా న్యాయస్థానం ప్రశ్నించింది. మరోవైపు ఈ అంశం రాజకీయ దుమారం రేపుతోంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. హైకోర్టును ఆశ్రయించారు. మొత్తంగా హైడ్రా చర్చనీయాంశంగా మారింది.


ఈ నేపథ్యంలో సోమవారం బాధితుల పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరయ్యారు. వర్చువల్‌గా హైకోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. ఆదివారం రోజు ఎందుకు కూల్చివేతలు చేశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించింది. పత్రికలు చెప్పినట్లు వింటున్నారా లేక లా ఫాలో అవుతున్నారా అని నిలదీసింది. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తున్నారో చెప్పాలని.. హైడ్రాకు ఉన్న చట్టబద్దత ఏంటో చెప్పాలంటూ కమిషనర్‌ను గట్టిగా నిలదీసింది. ఆదివారం ప్రశాంతంగా కుటుంబంతో గడపకుండా అధికారులు కక్షగట్టి కూల్చివేస్తున్నారని న్యాయస్థానం మండిపడింది.


ఈ వార్తలు కూడా చదవండి..

డాలస్‌లో వైభవంగా అక్కినేని శతజయంతి వేడుకలు

ఆ ఎంపీ ఆనంకు ఎందుకు భయపడుతున్నారు..

తిరుమల లడ్డూపై సుప్రీంకోర్టులో విచారణ..

హైడ్రా కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్..

రాష్ట్రాల ఆమోదం అక్కర్లే: పీఎం మోదీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 30 , 2024 | 01:40 PM