ట్రాఫిక్ కష్టాలు.. పోలీసుల సరికొత్త ప్రయోగం..

ABN, Publish Date - Aug 10 , 2024 | 12:06 PM

హైదరాబాద్: భాగ్యనగరం రోజు రోజుకు అభివృద్ధి దిశగా దూసుకువెళుతోంది. నగరంలో నివసించేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. అందుకే మహానగరంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్‌ను తగ్గించడానికి ఓవైపు చర్యలు తీసుకుంటున్నా.. మరోవైపు ఇబ్బందులు ఎదురౌతునే ఉన్నాయి. ట్రాఫిక్‌ను తగ్గించేలా సైబరాబాద్ పోలీసులు మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

హైదరాబాద్: భాగ్యనగరం రోజు రోజుకు అభివృద్ధి దిశగా దూసుకువెళుతోంది. నగరంలో నివసించేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. అందుకే మహానగరంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్‌ను తగ్గించడానికి ఓవైపు చర్యలు తీసుకుంటున్నా.. మరోవైపు ఇబ్బందులు ఎదురౌతునే ఉన్నాయి. ట్రాఫిక్‌ను తగ్గించేలా సైబరాబాద్ పోలీసులు మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఐటీ కంపెనీల భవనాలకు హైరైస్ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒక్కో హైరైస్ కెమెరా 360 డిగ్రీస్‌లో స్పష్టమైన విజువల్స్‌ను వీక్షిస్తుంది. జూమ్ చేసి వాహనాల నెంబర్లతో సహా స్పష్టంగా చూడవచ్చు. ఆ చుట్టుపక్కల ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడినా పోలీసులకు తెలిసేలా కెమెరాలను సైబరాబాద్ కమిషరేట్ పరిధిలోని పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్‌కు అనుసంధానం చేస్తారు. అక్కడ నుంచి సిబ్బంది మోనటరింగ్ చేస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆదివాసీ దినోత్సవంలో గిరిజనులతో సీఎం చంద్రబాబు..

ఏపీ మహిళలకు శుభవార్త...

దమ్ముంటే చంపు.. బయటకు రా..: దువ్వాడ వాణి

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 10 , 2024 | 12:06 PM