మూసీ నిర్వాసితుల ఆందోళన...

ABN, Publish Date - Sep 30 , 2024 | 02:00 PM

ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కన్నుతెరవాలని, హైదరాబాద్ అంటే ఇళ్లు కూలగొట్టడం కాదని, ఉపాధి చూపించి అభివృద్ధి చేయాలని మూసీ నిర్వాసితులు అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా.. మూసీ పరివాహక ప్రాంతాల్లో తమ ఇళ్లు కూల్చివేయాలనుకుంటే ప్రభుత్వం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాలసి వస్తుందని అన్నారు.

హైదరాబాద్: నగరంలో మూసీ నిర్వాసితులు ఆందోళన ఉధృతం చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. తమ ఇళ్లను కూల్చవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఒకానొక దశలో కలెక్టరేట్ గేట్లు తోసుకుంటూ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.


ఈ సందర్బంగా మూసీ నిర్వాసితులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఇప్పటికైనా ప్రభుత్వం కన్నుతెరవాలని, హైదరాబాద్ అంటే ఇళ్లు కూలగొట్టడం కాదని, ఉపాధి చూపించి అభివృద్ధి చేయాలని అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లు కూల్చివేసి పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లకు , విదేశీయులకు ఇద్దామనుకుంటున్నారా అని ప్రశ్నించారు. తాము కష్టపడి సంపాదించుకుని కట్టుకున్న ఇళ్లు కూల్చివేయడం సరికాదని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా.. మూసీ పరివాహక ప్రాంతాల్లో తమ ఇళ్లు కూల్చివేయాలనుకుంటే ప్రభుత్వం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాలసి వస్తుందని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డాలస్‌లో వైభవంగా అక్కినేని శతజయంతి వేడుకలు

ఆ ఎంపీ ఆనంకు ఎందుకు భయపడుతున్నారు..

తిరుమల లడ్డూపై సుప్రీంకోర్టులో విచారణ..

హైడ్రా కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్..

రాష్ట్రాల ఆమోదం అక్కర్లే: పీఎం మోదీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 30 , 2024 | 02:00 PM