కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

ABN, Publish Date - Jul 24 , 2024 | 07:43 AM

హైదరాబాద్: ప్రధాని మోదీకి తెలంగాణపై ఉన్న కక్ష్యను ప్రజలు ఊహించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, తెలంగాణ అని పలకడానికి కూడా కేంద్రం ఇష్టపడలేదని అన్నారు.

హైదరాబాద్: ప్రధాని మోదీకి తెలంగాణపై ఉన్న కక్ష్యను ప్రజలు ఊహించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, తెలంగాణ అని పలకడానికి కూడా కేంద్రం ఇష్టపడలేదని అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి బాధ్యత వహిస్తూ కిషన్ రెడ్డి వెంటనే మంత్రి వర్గం నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాభివృద్ధికి నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రిగా తాను మూడుసార్లు, మంత్రులు 18 సార్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీని, కేంద్రంలోని మంత్రులను కలిశామని, కేంద్రంతో వివాదాలు లేకుండా సత్సంబంధాలు కొనసాగించాలనీ, ప్రధాని రాష్ట్రానికి వచ్చిన సమయంలో పెద్దన్నలా వ్యవహరించాలని కోరామన్నారు.


కానీ, ఈ విజ్ఞప్తులను ఏమాత్రం పట్టించుకోలేదని, బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణ పట్ల కక్షపూరితంగా వ్యవహరించిందని, ఇక్కడి ప్రజల మీద వివక్ష ఎందుకు?.. ఇంతటి కక్షపూరిత వైఖరిని, వివక్షను ఎన్నడూ చూడలేదని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి నిధులు కేటాయించిన కేంద్రం, అదే చట్టం ప్రకారం తెలంగాణకు ఎందుకు నిధులు ఇవ్వలేదని సీఎం ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బడ్జెట్ రాష్ట్రానికి తోడ్పాటును ఇచ్చేలా ఉంది: సీఎం

ఏపీ హ్యాపీ..

పోలీసుల అదుపులో పెద్దిరెడ్డి అనుచరుడు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 24 , 2024 | 07:43 AM