మోదీ, అమిత్ షాతో మందకృష్ణ భేటీ..

ABN, Publish Date - Aug 10 , 2024 | 07:44 AM

న్యూఢిల్లీ: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ శుక్రవారం రాత్రి ఢిల్లీలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వారిని కలిసారు. . దాదాపు 30 నిమిషాలపాటు ప్రధానితో భేటీ అయిన మందకృష్ణ ఎస్సీ వర్గీకరణకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

న్యూఢిల్లీ: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు (MRPS Chief) మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) శుక్రవారం రాత్రి ఢిల్లీలో ప్రధాని మోదీ (PM Modi), హోంమంత్రి అమిత్ షా (Amit Shah)ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఎస్సీ వర్గీకరణపై (SC Classification) సుప్రీం కోర్టు (Supreme Court) అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వారిని కలిసారు. . దాదాపు 30 నిమిషాలపాటు ప్రధానితో భేటీ అయిన మందకృష్ణ ఎస్సీ వర్గీకరణకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే, మంద కృష్ణను ఆప్యాయంగా పలకరించి హత్తుకున్న ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ త్వరితగతిన అమలు అయ్యేలా చూడాలని కోరారు. వర్గీకరణ అంశంపై కొందరు సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణకు భారీగా పెట్టుబడులు..

జగన్ మారలేదు.. మేమే మారిపోతాం!

తెలంగాణ ఫ్యూచర్‌ స్టేట్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 11 , 2024 | 02:29 PM