మెడికల్ కాలేజ్ కూల్చే కుట్ర: పల్లా రాజేశ్వర్ రెడ్డి

ABN, Publish Date - Aug 25 , 2024 | 12:45 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చట్ జిల్లా, ఘట్‌కేశరి మండలం, వెంకటాపూర్‌లోని అనురాగ్ విశ్వవిద్యాలయం భవనాలను వెంకటాపూర్ నాదం చెరువులో నిర్మించారని నీటిపారుదలశాఖ ఏఈ ఐటీ కారిడర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చట్ జిల్లా, ఘట్‌కేశరి మండలం, వెంకటాపూర్‌లోని అనురాగ్ విశ్వవిద్యాలయం భవనాలను వెంకటాపూర్ నాదం చెరువులో నిర్మించారని నీటిపారుదలశాఖ ఏఈ ఐటీ కారిడర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. 25ఏళ్ల క్రితం తాము విద్యా సంస్థలు స్థాపించామని, గత 8నెలలుగా వ్యక్తి గతంగా తన మీద, తన కుటుంబంపై దాడి జరుగుతోందన్నారు.


గతంలో ఎప్పుడూ ఇలాంటి దాడి తనపై జరగలేదని, మెడికల్ కాలేజీ కూల్చే కుట్ర చేస్తున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ తమకు ఎన్‌వోసీ (NOC) ఇచ్చిందని, ఇప్పుడు అదే శాఖ తనపై కేసు పెట్టిందని చెప్సారు. తన భూమిలో మాత్రమే నిర్మాణాలు చేశామని, చెరువు భూమి ఇంచు కూడా అక్రమించలేదని స్పష్టం చేశారు. సర్వే చేసి కబ్జా చేసినట్లు చూపిస్తే కూల్చడానికి సిద్దమన్నారు. ఎక్కడ తప్పు జరిగిందో చెప్పి.. నోటీస్ ఇవ్వావ్వాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమలయ్య గుట్టకు పోటెత్తిన భక్తులు..

నేడు ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు

టీటీడీలో స్కామ్.. ఆ ముగ్గురిపై ఫిర్యాదులు..

హైడ్రా దూకుడు.. నెక్ట్స్ టార్గెట్ ఎవరు...?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 25 , 2024 | 12:45 PM