గేట్లను ఢీ కొట్టిన బోట్లు.. యజమానుల ఆచూకీ లభ్యం..

ABN, Publish Date - Sep 07 , 2024 | 05:56 PM

అమరావతి: ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీ కొట్టిన కేసులో కీలక అడుగు పడింది. బోట్ల యజమానుల ఆచూకీని పోలీసులు తెలుసుకున్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీ కొట్టిన వ్యవహారం వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

అమరావతి: ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీ కొట్టిన కేసులో కీలక అడుగు పడింది. బోట్ల యజమానుల ఆచూకీని పోలీసులు తెలుసుకున్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీ కొట్టిన వ్యవహారం వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్‌కు చెందిన బోట్లుగా గుర్తించారు. కొన్నేళ్లుగా మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఆధ్వర్యంలోనే ఈ బోట్లు నడుస్తున్నట్లు పోలీసులు తేల్చారు. అటు ఈ కేసులో పోలీసులు దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది.


కాగా ప్రకాశం బ్యారేజీ బోట్స్ ఢీకొన్న వ్యవహారంలో కుట్ర కోణం దాగి ఉందని.. దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ మంత్రి కొల్లు రవ్రీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టిన బోట్లని కూడా వైసీపీ నాయకులకు చెందినవిగా అనుమానాలు ఉన్నాయన్నారు. ఉద్దేశపూర్వకంగానే బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీ కొన్నట్లు సమాచారం ఉందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దువ్వాడ శ్రీనివాస్ డ్రామాలో కీలక ట్విస్టు..

విజయవాడ వాసులకు మరో చేదు వార్త..

గండ్ల పూడ్చివేత పనులు పరిశీలించిన మంత్రి లోకేష్..

మహాశక్తి గణపతికి తొలిపూజలో సీఎం రేవంత్ రెడ్డి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 07 , 2024 | 05:56 PM