అధ్యక్ష బాధ్యతలా.. మాకొద్దు బాబోయ్‌..

ABN, Publish Date - Sep 06 , 2024 | 08:02 AM

ప్రకాశం జిల్లా: వైసీపీ అధ్యక్ష బాధ్యలు చేపట్టేందుకు ఆ జిల్లా నేతలు ముందుకు రావడంలేదు. పార్టీ పెద్దలు పదవి ఇస్తామన్నా వద్దనే పరిస్థితి ఉంది. పవర్‌లో ఉండగా పెత్తనం కోసం పోటీపడ్డ నేతలు.. ఇప్పుడు పార్టీ బాధ్యతలు తీసుకోడానికి ముఖం చాటేస్తున్నారు. దీనికి కారణాలేంటి..?

ప్రకాశం జిల్లా: వైసీపీ అధ్యక్ష బాధ్యలు చేపట్టేందుకు ఆ జిల్లా నేతలు ముందుకు రావడంలేదు. పార్టీ పెద్దలు పదవి ఇస్తామన్నా వద్దనే పరిస్థితి ఉంది. పవర్‌లో ఉండగా పెత్తనం కోసం పోటీపడ్డ నేతలు.. ఇప్పుడు పార్టీ బాధ్యతలు తీసుకోడానికి ముఖం చాటేస్తున్నారు. దీనికి కారణాలేంటి..? వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. పవర్‌లో ఉన్నప్పుడు పెత్తనం చెలాయించేందుకు నేతలు పోటీ పడ్డారు. కానీ ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ముందుకు రావడంలేదు.


తాడేపల్లి పెద్దలు ఒక్కొక్కరిని పిలిచి బాధ్యతలు అప్పగిస్తామని బ్రతిమలాడుతున్నా.. స్వీకరించేందుకు నేతలు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఎవరికి వారు ముఖం చాటేస్తున్నారు. దీంతో ప్రకాశం జిల్లాలో వైసీపీ దుస్థితిపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ సీట్లు, ఒక పార్లమెంట్ స్థానం ఉంది. వైసీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కనుసన్నల్లోనే పార్టీ వ్యవహారాలు నడిచాయి. జగన్‌కు బాలినేని దగ్గర బంధువు. దీంతో ఈ నేత మాటకు ఎదురు లేకుండా నడిచింది. తాను చెప్పిందే వేదం అన్నట్టుగా వ్యవహరించారు. బాలినేని తీరుతో విసిగిపోయిన నేతలు తాడేపల్లి ప్యాలస్‌కు ఫిర్యాదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కౌశిక్ రెడ్డికి బల్మూరి వెంకట్ కౌంటర్..

నటి జత్వానీ కేసులో ట్విస్ట్..

సంచలన విషయాలు బయటపెట్టిన ఆదిమూలం కుమార్తెలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 06 , 2024 | 08:55 AM