గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రక్షాళన...

ABN, Publish Date - Aug 09 , 2024 | 08:16 AM

అమరావతి: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు.

అమరావతి: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు. సచివాలయ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, వారి సేవలను సమర్ధంగా వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన వైసీపీ సర్కార్.. మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో పదుల సంఖ్యలో ఉద్యోగులను నియమించడం.. వారికి జాబ్ చార్ట్ లేకపోవడం.. కొందరికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం.. మరికొందరికి అసలు పని లేకపోవడంతో ఈ వ్యవస్థ ప్రక్షాళన తప్పినిసరి అని తేల్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యుత్‌పై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

శోభిత ధూళిపాళ.. సమంతకు అక్క అవుతుందా? ఈ ట్విస్టేంటి?

ఏపీ రాష్ట్రంలో మళ్లీ జన్మభూమి!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 09 , 2024 | 08:16 AM