అనంతపురం జిల్లాలో మరో అపచారం..
ABN, Publish Date - Sep 24 , 2024 | 01:59 PM
అనంతపురం: తిరుమలలో లడ్డూ కల్తీ వివాదం కొనసాగుతుండగానే అనంతపురం జిల్లాలో మరో అపచారం జరిగింది. కనేకల్ మండలం హనకనహల్లో దుండగులు ఏకంగా రామాలయం రథానికి నిప్పు పెట్టారు.
అనంతపురం: తిరుమలలో లడ్డూ కల్తీ వివాదం కొనసాగుతుండగానే అనంతపురం జిల్లాలో మరో అపచారం జరిగింది. కనేకల్ మండలం, హనకనహల్లో దుండగులు ఏకంగా రామాలయం రథానికి నిప్పు పెట్టారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు శ్రీ రామాలయానికి వచ్చి రథానికి నిప్పు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు మంటలను ఆర్పేందుకు యత్నించారు. అప్పటికే సగానికిపైగా రథం కాలిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రథానికి నిప్పు పెట్టిన దుండగులను శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ హయాంలో.. పేదల భూములతో బంతాట
తిరుమలకు కాలినడకన పవన్ కళ్యాణ్..
మేడిగడ్డ ఇంజనీర్ల పై క్రిమినల్ చర్యలు..
కేడర్కు ముఖం చాటేసిన మాజీ మంత్రి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Sep 24 , 2024 | 01:59 PM