యజమానికి తెలియకుండా ఇల్లు అమ్మకం ...

ABN, Publish Date - Oct 18 , 2024 | 01:53 PM

హైదరాబాద్: నగరంలో యజమానికి తెలియకుండానే ఓ ఇంటిని అమ్మేసారు. దీనిపై మియాపూర్‌లో ట్రెస్ పాస్, చీటింగ్ కేసు నమోదైంది. దండు లచ్చి రాజు అనే వ్యక్తికి చెందిన ప్రాపర్టీలోకి అక్రమంగా వచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్: నగరంలో యజమానికి తెలియకుండానే ఓ ఇంటిని అమ్మేసారు. దీనిపై మియాపూర్‌లో ట్రెస్ పాస్, చీటింగ్ కేసు నమోదైంది. దండు లచ్చి రాజు అనే వ్యక్తికి చెందిన ప్రాపర్టీలోకి అక్రమంగా వచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో తన్నీరు గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజకుమార్ గౌడ్, గారపాటి నాగ రవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావులపై కేసు నమోదైంది.


ఫాస్మో హాస్పిటాలిటీ సర్వీసెస్ పేరుతో ట్రెస్ పాస్ చేశారని.. బ్లాంక్ చెక్, బ్లాంక్ ప్రాంసరీ నోట్ తీసుకుని చీటింగ్‌కు పాల్పడ్డారని నిందితులపై ఆరోపణలు ఉన్నాయి. తనకు తెలియకుండానే తన ఇంటిని అమ్మేసారని జంపన ప్రభావతిపై లచ్చిరాజు ఫిర్యాదు చేశారు. తనకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చారని.. ఈ విషయంపై 2019 నుంచి పోరాటం చేస్తున్నట్లు లచ్చి రాజు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖకు మహర్దశ.. ఇండస్ట్రీయల్ హబ్‌గా...

మహర్షి వాల్మీకి జయంతోత్సవాలు..

నల్గొండలో సీఎం కప్ ర్యాలీ..

నన్ను క్షమించండి.. రోహిత్ శర్మ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 18 , 2024 | 01:55 PM