తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీం కీలక నిర్ణయం

ABN, Publish Date - Oct 04 , 2024 | 12:23 PM

కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్ తుషార్‌ మెహతా సుప్రీం కోర్టు ఎదుట కీలక అంశాలు ప్రస్తావించారు. తిరుమల లడ్డూ వ్యవహారం మొత్తాన్ని పరిశీలించానని, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిట్‌ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవని ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు.

న్యూఢిల్లీ: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం దీనిని విచారించి.. కీలక నిర్ణయం తీసుకుంది. ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీనిలో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలని సూచించింది.


సిట్ సభ్యులపై సందేహాల్లేవు..

ధర్మాసనం తీర్పు వెలువడక ముందు.. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్ తుషార్‌ మెహతా కోర్టు ఎదుట కీలక అంశాలు ప్రస్తావించారు. ‘‘తిరుమల లడ్డూ వ్యవహారం మొత్తాన్ని పరిశీలించాను. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిట్‌ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవు. సిట్‌పై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే ఆమోదయోగ్యం కాదు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులున్నారు. సీనియర్‌ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుంది. స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే.. రాజకీయ జోక్యం ఉండదు’’ అని తుషార్ మెహతా అన్నారు. ఈ మేరకు స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

వివేకా కేసు.. హైకోర్టు కీలక నిర్ణయం

బాల్కంపేట ఎల్లమ్మ తల్లి మహా లక్ష్మి అలంకరణలో..

ఖమ్మం టీఆర్ఎస్ ఆఫీస్‌లో బతుకమ్మ సంబరాలు

తిరుపతిలో పవన్ కల్యాణ్ వారాహి డిక్లరేషన్‌ సభ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 04 , 2024 | 12:23 PM