కోల్‌కతా ఘటనపై సుప్రీం సీరియస్..

ABN, Publish Date - Aug 19 , 2024 | 08:26 AM

న్యూఢిల్లీ: కోల్‌కతా ఆస్పత్రిలో మెడికో అత్యాచారం కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. మరోవైపు ఇది పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా.. నిందితులను ఉరి తీయాలని మమత బెనర్జీ డిమాండ్ చేశారు.

న్యూఢిల్లీ: కోల్‌కతా ఆస్పత్రిలో మెడికో అత్యాచారం కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. మరోవైపు ఇది పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా.. నిందితులను ఉరి తీయాలని మమత బెనర్జీ డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణను చీఫ్ జస్టీస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ఈనెల 20న (మంగళవారం) చేపట్టనుంది. కేసును సుమోటీవ్‌గా తీసుకోవాలంటూ ఇద్దరు న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ క్రమంలోనే కేసు విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం వెబ్ సైట్‌లో పొందిపరిచారు. ఇప్పటికే కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు హత్యాచారం కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం సిద్ధరామయ్య వర్సెస్ గవర్నర్..

సినిమాల్లో హీరో... బయట జీరో..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 19 , 2024 | 08:26 AM