వారిని కఠినంగా శిక్షించాలి: పట్టాభిరామ్

ABN, Publish Date - Oct 04 , 2024 | 02:04 PM

సుప్రీం కోర్టు తీర్పును సీఎం చంద్రబాబు సహా అందరం స్వాగతిస్తున్నామని, వీలైనంత త్వరలో దోషులను పట్టుకోవాలని.. వారికి కఠిన శిక్ష పడాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు.

అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం తీర్పుపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ సుప్రీం తీర్పును సీఎం చంద్రబాబు సహా అందరం స్వాగతిస్తున్నామని అన్నారు. వీలైనంత త్వరలో దోషులను పట్టుకోవాలని.. వారికి కఠిన శిక్ష పడాలని అన్నారు.


కాగా ‘‘సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్యస్వామి, ఇతర పిటిషనర్ల తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్స్‌ను ఉద్దేశించి సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది. కోర్టు హాలు రాజకీయ క్రీడలకు వేదికగా అనుమతించమని.. ఏమైనా ఉంటే కోర్టు బయట చూసుకోవాలని సూచించింది.’’ పిటిషనర్ల తరఫున వాదించిన న్యాయవాదులు రాజకీయపరమైన కామెంట్లు మాట్లాడారని దీనిపై న్యాయస్థానం ఘాటుగా స్పందించి ఈ వ్యాఖ్యలు చేసిందని పట్టాభిరామ్ అన్నారు. వీలైనంత త్వరలో అధికారులు కేసును పరిష్కరించాలని కోరుకుంటున్నామని ఆయన వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజినీకాంత్

తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీం కీలక నిర్ణయం

వివేకా కేసు.. హైకోర్టు కీలక నిర్ణయం

బాల్కంపేట ఎల్లమ్మ తల్లి మహా లక్ష్మి అలంకరణలో..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 04 , 2024 | 02:04 PM