కేటీఆర్ పర్యటనలో ఉద్రిక్తత..

ABN, Publish Date - Oct 01 , 2024 | 01:57 PM

మూసీ బాధితుల భరోసా కోసం అంబర్‌పేట, గోల్నాక, లంక కాలనీలు తదితర ప్రాంతాల్లో కేటీఆర్ మంగళవారం పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పర్యటను ముందస్తుగానే అడ్డుకుంటామని కాంగ్రెస్ శ్రేణులు పిలుపిచ్చాయి. అందులో భాగంగా మొదట అంబర్ పేట్‌లో అడ్డుకునే ప్రయత్నం చేశారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పర్యటనలో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ముషీరాబాద్‌లో కేటీఆర్ కాన్వాయ్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మూసీ బాధితుల భరోసా కోసం బయలుదేరిన కేటీఆర్‌కు నిరసనసెగ తగిలింది. ముషీరాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంతమంది కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయ్ ఎక్కి.. కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.


మూసీ బాధితుల భరోసా కోసం అంబర్‌పేట, గోల్నాక, లంక కాలనీలు తదితర ప్రాంతాల్లో కేటీఆర్ మంగళవారం పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పర్యటను ముందస్తుగానే అడ్డుకుంటామని కాంగ్రెస్ శ్రేణులు పిలుపిచ్చాయి. అందులో భాగంగా మొదట అంబర్ పేట్‌లో అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ముషీరాబాద్‌కు చేరుకున్న కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకుని నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ.. మంత్రి వర్గ విస్తరణపై చర్చలు

ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత..

సింగరేణిలో మరో నల్ల చట్టం..

కర్నాటకలో ఏడీజీ వర్సెస్ కుమారస్వామి

నటుడు గోవింద ఇంట్లో గన్ మిస్ ఫైర్ ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 01 , 2024 | 01:57 PM