తిరుమల లడ్డూకు 310 సంవత్సరాల చరిత్ర..
ABN, Publish Date - Sep 24 , 2024 | 09:55 PM
తిరుమల వేంకటేశ్వరస్వామి తర్వాత ఆ స్థాయిలో ప్రాచూర్యం పొందింది స్వామివారి లడ్డు. వైష్ణవ స్వాములు మాత్రమే తయారు చేసే ఈ లడ్డూలను పరమపవిత్రంగా భావిస్తారు. స్వామివారికి వివిధ రూపాల్లో 50రకాల ప్రసాదాలు సమర్పిస్తారు.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి తర్వాత ఆ స్థాయిలో ప్రాచూర్యం పొందింది స్వామివారి లడ్డు. వైష్ణవ స్వాములు మాత్రమే తయారు చేసే ఈ లడ్డూలను పరమపవిత్రంగా భావిస్తారు. స్వామివారికి వివిధ రూపాల్లో 50రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. కానీ లడ్డూకున్న ప్రత్యేకత వేరు. తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న తర్వాత ప్రతి భక్తుడు ప్రాధాన్యమిచ్చేది లడ్డూకే. తిరుమల లడ్డూకు 310సంవత్సరాల చరిత్ర ఉంది. 1715లో బూందీ రూపంలో లడ్డూని శ్రీవారికి సమర్పించేవారు. ఉత్సవంలో భక్తులకు పంచేవారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని 1803లో అప్పటి మద్రాస్ సర్కార్ మెుదటిసారి ఆలయంలో బూందీ ప్రసాదాన్ని ఇవ్వడం ప్రారంభించింది. ఇదో చారిత్రక ఆధారం కాగా.. అప్పట్నుంచి ప్రసాదాలు కూడా విక్రయించేవారు. పల్లవుల కాలం నుంచే ప్రసాదాల పరంపర మెుదలైందని చరిత్ర చెబుతుండగా.. అప్పట్లోనే శ్రీవారికి సంధి నివేదనలగా నేవైద్య వేళలు ఖరారయ్యాయి. ఈ సమయంలోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. ఆ రోజుల్లో కొండ మీద భోజన సదుపాయం లేకపోవడంతో ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ హయాంలో.. పేదల భూములతో బంతాట
తిరుమలకు కాలినడకన పవన్ కళ్యాణ్..
మేడిగడ్డ ఇంజనీర్ల పై క్రిమినల్ చర్యలు..
కేడర్కు ముఖం చాటేసిన మాజీ మంత్రి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Sep 24 , 2024 | 09:57 PM