పల్నాడు జిల్లా: సర్పంచ్ ఇంటిపై వైసీపీ దాడి..

ABN, Publish Date - May 17 , 2024 | 10:28 AM

పల్నాడు జిల్లా: వైసీపీ దాడులు ఆగలేదు. ఇప్పటికే దాడులతో అట్టడుకిన పల్నాడు జిల్లా ఇంకా రగులుతూనే ఉంది. తాజాగా గత రాత్రి బెల్లంకొండ సర్పంచ్ ఇంటిపై వైసీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. దళిత మహిళ సర్పంచ్ ఇంట్లో లేని సమయంలో ఆమె భర్త సముద్రంను టార్గెట్ చేశారు.

పల్నాడు జిల్లా: వైసీపీ దాడులు ఆగలేదు. ఇప్పటికే దాడులతో అట్టడుకిన పల్నాడు జిల్లా ఇంకా రగులుతూనే ఉంది. తాజాగా గత రాత్రి బెల్లంకొండ సర్పంచ్ ఇంటిపై వైసీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. దళిత మహిళ సర్పంచ్ ఇంట్లో లేని సమయంలో ఆమె భర్త సముద్రంను టార్గెట్ చేశారు. అయితే ఆ సమయంలో ఆయన కూడా అక్కడ లేకపోవడంతో ఇంటి ముందున్న కారును ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అల్లర్లు చెలరేగకుండా ప్రయత్నం చేశారు. కాగా తమపై ఎన్ని దాడులు చేసినా.. టీడీపీని వదిలే ప్రసక్తే లేదని, టీడీపీ కోసమే పనిచేస్తామంటూ సర్పంచ్ జ్యోతి భర్త సముద్రం తెగేసి చప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నల్గొండ బీఆర్ఎస్‌లో ముసలం..

పవన్ కళ్యాణ్ గెలుపుపై కోట్లలో బెట్టింగ్

బయటపడిన జగన్ నిజస్వరూం..

హైదరాబాద్‌లో కుండపోత వర్షం దృశ్యాలు..

‘ఇండీ’ కూటమికి ప్రధాని సవాల్‌

అయ్యో.. ‘అమ్మ’..!

వైసీపీ నేతల ఇళ్లలో పెట్రోలు బాంబులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 17 , 2024 | 10:28 AM