జగన్‌ను కలవని వైసీపీ ఎమ్మెల్యేలు..

ABN, Publish Date - Jun 06 , 2024 | 08:48 AM

అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవానికి జగన్‌, ఆయన చుట్టూ ఉన్న కోటరీ, సీఎం కార్యాలయ అధికారులే కారణమని ఓటమి పాలైన వైసీపీ అభ్యర్థులు రగిలిపోతున్నారు. కొందరు సీఎంవోను తప్పుబడుతుండగా... మరికొందరు జగన్మోహన్‌ రెడ్డి వైఖరే ఈ దుస్థితి కారణమని మండిపడుతున్నారు.

అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవానికి జగన్‌, ఆయన చుట్టూ ఉన్న కోటరీ, సీఎం కార్యాలయ అధికారులే కారణమని ఓటమి పాలైన వైసీపీ అభ్యర్థులు రగిలిపోతున్నారు. కొందరు సీఎంవోను తప్పుబడుతుండగా... మరికొందరు జగన్మోహన్‌ రెడ్డి వైఖరే ఈ దుస్థితి కారణమని మండిపడుతున్నారు. మంగళవారం జక్కంపూడి రాజా నేరుగా సీఎం మాజీ కార్యదర్శి ధనుంజయరెడ్డిపైనే ధ్వజమెత్తారు. మరోవైపు... వైపీపీ ముఖ్యనేతలెవరూ తాడేపల్లి వైపు చూడడంలేదు. చివరికి... గెలుపొందిన పది మంది అభ్యర్థులు కూడా జగన్‌ను మర్యాదపూర్వకంగా కలవలేదు. తాడేపల్లి పేరు చెబితేనే ముఖం చిట్లిస్తున్నారు. ‘వైనాట్‌ 175’ అంటూ బీరాలు పలికిన జగన్‌ మాటలు నమ్మి ఘోరంగా మోసపోయామని... కోట్లు ఖర్చు చేసి కోలుకోలేనంతగా దెబ్బతిన్నామని వాపోతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్: ముంచేసిన వరద దృశ్యాలు..

వైసీపీలో కలకలం

సీఎస్ సెలవుపై వెళ్లాలని సంకేతాలు..!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 06 , 2024 | 08:48 AM