తండ్రి బాటలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి

ABN, Publish Date - Jul 07 , 2024 | 07:50 AM

అమరావతి: ఎన్నికల ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నానని వైరాగ్యం ప్రదర్శించిన జగన్‌రెడ్డి ఈ మధ్య కొంత తేరుకొని ప్రస్తుతం నెల్లూరు జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు అడుగు బయట పెట్టారు.

అమరావతి: ఎన్నికల ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నానని వైరాగ్యం ప్రదర్శించిన జగన్‌రెడ్డి ఈ మధ్య కొంత తేరుకొని ప్రస్తుతం నెల్లూరు జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు అడుగు బయట పెట్టారు. 2004కు ముందు వైఎస్‌ రాజశేఖర రెడ్డి కూడా హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న గౌరు వెంకటరెడ్డిని పరామర్శించేందుకు కర్నూలు జైలుకు వెళ్లారు. ఇప్పుడు తండ్రి బాటలో జగన్మోహన్‌రెడ్డి పిన్నెల్లిని జైల్లో పరామర్శించారు. పరామర్శల తర్వాత జైలు బయట ఆయన విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కూడా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలోని రావు రమేశ్‌ డైలాగ్‌ను గుర్తుకు తెస్తున్నాయి. ప్రజలు తనను ఎందుకు గెలిపించారో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచించుకోవాలని జగన్‌రెడ్డి సెలవిచ్చారు. ప్రజల్లో వ్యతిరేకత వల్ల తాను ఓడిపోలేదని, మంచి చేసి కూడా ఓడిపోయానన్న వింత లాజిక్‌ను కూడా తెర మీదకు తెచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తాడేపల్లి ప్యాలెస్ ప్రహరీ గోడ ఖర్చు 10 కోట్లు..!

Jagan : చంద్రబాబూ.. హెచ్చరిస్తున్నా!

RK Kothapaluku : నవ్విపోదురుగాక..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 07 , 2024 | 07:50 AM