జగనన్న లడాయి మాటలు.. బడాయి కూతలు..

ABN, Publish Date - Aug 05 , 2024 | 07:33 AM

అమరావతి: వైసీపీ పాలనలో కట్టించిన పక్కా ఇళ్లు పేకమేడలను తలపిస్తున్నాయి. పునాదుల నుంచి పై కప్పు వరకు నాశిరకంగా పనులు చేయడం వల్ల అబ్దిదారులు ఇబ్బంది పడుతున్నారు. సొంత మనుషులకు జగన్ కాంట్రాక్టు ఇవ్వడంతో గుంటూరు జిల్లా, పేరేచర్లలో అడ్డగోలుగా ఇళ్లను నిర్మించారు.

అమరావతి: వైసీపీ (YCP) పాలనలో కట్టించిన పక్కా ఇళ్లు (Houses)పేకమేడలను తలపిస్తున్నాయి. పునాదుల నుంచి పై కప్పు వరకు నాశిరకంగా పనులు చేయడం వల్ల అబ్దిదారులు ఇబ్బంది పడుతున్నారు. సొంత మనుషులకు జగన్ (Jagan) కాంట్రాక్టు ఇవ్వడంతో గుంటూరు జిల్లా (Guntur Dist.,), పేరేచర్లలో అడ్డగోలుగా ఇళ్లను నిర్మించారు. నాణ్యత అంటే అది ఎక్కడ ఉంటుందో అని వెతుక్కోవల్సిన పరిస్థితి నెలకొంది. ఇళ్లు కాదు.. నిర్మించేది ఊళ్లు అన్నారు. లడాయి మాటలు.. బడాయి కూతలు కూసారు.. చెప్పిన మాటలకు.. చేసిన పనులకు పొంతన లేదు. జగనన్న కాలనీలోపేదవాడికి పక్కా ఇంటిని నిర్మిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం పేదలను నట్టేటముంచింది. గుంటూరు జిల్లా, మేడికొండూరు మండలం, పేరేచర్ల సమీపంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ రాష్ట్రంలోనే అతిపెద్ద లే అవుట్. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో 390 ఎకరాల భూమిని జగన్ ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. అయితే వైసీపీ నేతలు కమీషన్లకు కక్కుర్తిపడి నల్లరేగడి భూములు వాగుకు పక్కన ఉన్న లోతట్టు ప్రాంతాలలో భూమిని సేకరించారు. దీంతో లబ్దిదారులకు శాపంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి..

లవ్ జిహాద్‌పై కొత్త చట్టం..

మూడో ప్రపంచ యుద్ధం.. ముప్పు అంచున?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 05 , 2024 | 07:33 AM