dmho బత్తలపల్లి పీహెచసీలో క్యాన్సర్ స్ర్కీనింగ్ సెంటర్
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:31 AM
బత్తలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్యాన్సర్ స్ర్కీనింగ్ సెంటర్ను డీఎంహెచఓ ఫిరోజాబేగం శుక్రవారం ప్రారంభించారు.

బత్తలపల్లి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): బత్తలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్యాన్సర్ స్ర్కీనింగ్ సెంటర్ను డీఎంహెచఓ ఫిరోజాబేగం శుక్రవారం ప్రారంభించారు. డీఎంహెచఓ మాట్లాడుతూ.. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ను గుర్తించేందుకు ఆర్డీటీ వారితో కలసి ఈ పీహెచసీలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచఓ సెల్విరాజ్, ఆర్డీటీ గైనకాలజిస్ట్ జ్యోతిర్మయి, రమ్య, శిల్ప, శ్రీనివా్సరెడ్డి, నాగేంద్రనాయక్, జనార్దననాయుడు పాల్గొన్నారు.
ధర్మవరంరూరల్ : మండలంలోని దర్శినమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రావులచెరువులోని విలేజ్ హెల్త్ క్లినిక్ను జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి ఎస్ ఫిరోజాబేగం శుక్రవారం తనిఖీ చేశారు. ఆమె వెంట డీఐఓ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ డీఎంహెచఓ నాగేంద్రనాయక్, వైద్యాధికారి డాక్టర్ దిలీ్పకుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.