మార్నింగ్ నుంచే మాడుతోంది
ABN , Publish Date - Apr 24 , 2025 | 01:04 AM
42 డిగ్రీలకు చేరిన పగటి ఉష్ణోగ్రతలు మంట పుట్టిస్తున్న వేడిగాలులు
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): భానుడి భగభగలతో జిల్లావాసులు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వేడిగాలుల కారణంగా చిత్తూరు నగరంలోని పలు ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇతర రహదారులపై ట్రాఫిక్ రద్దీ తగ్గింది. బుధవారం అత్యధికంగా తవణంపల్లెలో 42.1, శ్రీరంగరాజపురంలో 41.1, నగరిలో 40.2, అత్యల్పంగా పలమనేరులో 34.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.చిత్తూరు, గుడిపాల మండలాల్లో 39.9డిగ్రీలు, పులిచెర్ల, పూతలపట్టు, వెదురుకుప్పం మండలాల్లో 39, గంగాధరనెల్లూరులో 38.9, సదుం, సోమల మండలాల్లో 38.8, బంగారుపాళ్యంలో 38.7, చౌడేపల్లె, ఐరాల, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, విజయపురం మండలాల్లో 38.2, రొంపిచెర్లలో 38, గంగవరం, గుడుపల్లె, కుప్పం, పెద్దపంజాణి, శాంతిపురం మండలాల్లో 37.8, యాదమరిలో 37.7, కార్వేటినగరంలో 37, బైరెడ్డిపల్లెలో 36.2, వి.కోటలో 35.7, పుంగనూరు, రామకుప్పం మండలాల్లో 35.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): భానుడి భగభగలతో జిల్లావాసులు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వేడిగాలుల కారణంగా చిత్తూరు నగరంలోని పలు ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇతర రహదారులపై ట్రాఫిక్ రద్దీ తగ్గింది. బుధవారం అత్యధికంగా తవణంపల్లెలో 42.1, శ్రీరంగరాజపురంలో 41.1, నగరిలో 40.2, అత్యల్పంగా పలమనేరులో 34.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.చిత్తూరు, గుడిపాల మండలాల్లో 39.9డిగ్రీలు, పులిచెర్ల, పూతలపట్టు, వెదురుకుప్పం మండలాల్లో 39, గంగాధరనెల్లూరులో 38.9, సదుం, సోమల మండలాల్లో 38.8, బంగారుపాళ్యంలో 38.7, చౌడేపల్లె, ఐరాల, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, విజయపురం మండలాల్లో 38.2, రొంపిచెర్లలో 38, గంగవరం, గుడుపల్లె, కుప్పం, పెద్దపంజాణి, శాంతిపురం మండలాల్లో 37.8, యాదమరిలో 37.7, కార్వేటినగరంలో 37, బైరెడ్డిపల్లెలో 36.2, వి.కోటలో 35.7, పుంగనూరు, రామకుప్పం మండలాల్లో 35.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.