పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రతను అలవాటు చేసేందుకు పార్వతీపురం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ముస్తాబు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమం గురించి విద్యార్థుల ద్వారా తెలుసుకుని దాని రూపకర్త మన్యం జిల్లా కలెక్టర్ నక్కల ప్రభాకర రెడ్డిని అభినందించారు.
నేలమీద వ్యవసాయం మనకు తెలుసు. నీటిమీద సాగు మనకు సరికొత్త వ్యవసాయ విధానం. అందునా సముద్రంలో సేద్యం.. ఎలా సాధ్యం అని ఆశ్చర్యం సహజం. ఇప్పుడా వ్యవసాయం మన తిరుపతి జిల్లాలోనే ప్రయోగాత్మకంగా మొదలైంది. అత్యంత విలువైన సముద్రపు నాచును బంగాళాఖాతంలో వాకాడు, తడ మండలాల్లోని మత్స్యకార మహిళలు పండిస్తున్నారు.
చదవడం, రాయడం, ప్రాథమిక గణితం ఇవే విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు. ప్రభుత్వం అందుకే ప్రాథమిక స్థాయి విద్య బలోపేతంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే 75 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక గ్యారెంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (జీఎ్ఫఎల్ఎన్) కార్యక్రమాన్ని రూపొందించింది.
విద్యార్థులకు శాస్త్రసాంకేతిక రంగాలపై అవగాహన ఉండాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా స్థాయి సైన్స్ఫెయిర్ కార్యక్రమాన్ని ఆమె టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, సర్వశిక్ష అభియాన్ జిల్లా అధికారి గౌరీశంకర్రావు, డీఈవో కేవీఎస్ కుమార్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధుడి ఆలయ ప్రాంగణం త్వరలో కొత్తరూపు సంతరించుకోనుంది. ఆలయం ముందు నుంచి పుష్కరిణిని 60 అడుగుల దూరంలోకి మార్చనున్నారు.
విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే నైపుణ్యాలు పెంచుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. విద్యాశాఖ-సమగ్రశిక్ష సంయుక్తంగా శనివారం స్థానిక జ్యోతిరావ్ పూలే భవనంలో ఏర్పాటు చేసిన కెరీర్ ఎక్స్పో, ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించి, ప్రసంగించారు.
గుండెకు సంబంధించిన మందులు వికటించి టీటీడీ మాజీ పాలకమండలి సభ్యుడు ఓవీ రమణ అస్వస్థతకు గురయ్యారు.
క్రిస్మస్, న్యూఇయర్ గిఫ్ట్ పేరుతో లింక్లు పంపిస్తారు. వీటిని క్లిక్ చేసినట్లయితే బ్యాంకు ఖాతాల్లోని నగదు పూర్తిగా మాయమయ్యే అవకాశాలున్నాయి. ఇలాంటి సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని ఎస్పీ సుబ్బరాయుడు సూచించారు.
సీఎం చంద్రబాబు స్వగ్రామమైన చంద్రగిరి మండలం నారావారిపల్లెలో చిరుత సంచారం కలకలం రేగింది.
చదువుకు పేదరికం అడ్డుకాదు. ఆత్మవిశ్వాసం, పట్టుదలకు తోడు, సరైన ప్రణాళికను ఆచరిస్తే చాలు. అద్భుత విజయాలను సొంతం చేసుకోవచ్చని నిరూపించారు దాసరి ఇందుమతి. తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసె్స(ఐఈఎస్) పరీక్షల్లో ఓసీ (ఈడబ్ల్యూఎ్స)కేటగిరీలో జాతీయ స్థాయి 75వ ర్యాంకు సాధించారు.