Share News

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

ABN , Publish Date - Apr 20 , 2025 | 02:16 AM

తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం వెందోడు - నిడిగల్లు రైల్వేస్టేషన్ల మధ్యలోని జయంపు సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి తిరుపతి నుంచి విజయవాడ వైపు వెళుతున్న గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది.

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు
రైలును పరిశీలిస్తున్న రైల్వే అదికారులు

బాలాయపల్లి, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం వెందోడు - నిడిగల్లు రైల్వేస్టేషన్ల మధ్యలోని జయంపు సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి తిరుపతి నుంచి విజయవాడ వైపు వెళుతున్న గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. అడ్డుగా వచ్చిన గేదెలను రైలు ఢీకొనడంతో పట్టాలు తప్పింది. అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే రైలును నిలిపివేశారు. ఈ ఘటనతో ఈ మార్గంలో కొంత సమయం పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు పట్టాలకు మరమ్మతులు చేపట్టి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనలో దాదాపు 10 గేదెలు చనిపోయినట్లు తెలుస్తోంది.

Updated Date - Apr 20 , 2025 | 02:16 AM