వెంకన్న సేవలో సినీ తారలు
ABN , Publish Date - Apr 20 , 2025 | 02:18 AM
సినీ హీరోయిన్లు సమంత, కయాదు లోహార్ తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు.‘డ్రాగన్’ సినిమాతో మంచి గుర్తింపు పొందిన కయాదు లోహార్ శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుమల, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): సినీ హీరోయిన్లు సమంత, కయాదు లోహార్ తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు.‘డ్రాగన్’ సినిమాతో మంచి గుర్తింపు పొందిన కయాదు లోహార్ శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు.సమంత తాను నిర్మిస్తున్న ‘శుభం’ సినిమా హీరో హర్షిత్రెడ్డి, హీరోయిన్ శ్రియ తదితరులతో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాళహస్తి వెళ్లిన ఆమె వాయులింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు.