Share News

ముదురుతున్న ఎండలు

ABN , Publish Date - Apr 22 , 2025 | 01:14 AM

జిల్లాలో వారం రోజులుగా ఎండలు ముదురుతున్నాయి. అత్యవసర పనులుంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం జంకుతున్నారు.

ముదురుతున్న ఎండలు
ఎండల ధాటికి బోసిపోయిన చిత్తూరు దర్గా సర్కిల్‌

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వారం రోజులుగా ఎండలు ముదురుతున్నాయి. అత్యవసర పనులుంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం జంకుతున్నారు. సోమవారం అత్యధికంగా శ్రీరంగరాజపురం, తవణంపల్లె మండలాల్లో 39.1, అత్యల్పంగా పలమనేరులో 33.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మండలాలవారీగా.. పులిచెర్ల, పూతలపట్టు, వెదురుకుప్పంలో 38.7, గుడిపాల, చిత్తూరులో 38.4, సోమలలో 38.1, సదుంలో 37.8, రొంపిచెర్లలో 37.5, గంగాధరనెల్లూరులో 37.3, యాదమరిలో 36.8, బంగారుపాళ్యం, చౌడేపల్లె, ఐరాల, కార్వేటినగరం, విజయపురం, నగరి, పాలసముద్రం, నిండ్ర, పెనుమూరులో 36.7, గుడుపల్లె, శాంతిపురంలో 36.4, గంగవరం, పెద్దపంజాణిలో 35.5, బైరెడ్డిపల్లెలో 34.7, పుంగనూరు, రామకుప్పంలో 34.3, కుప్పం, వి.కోటలో 34.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Apr 22 , 2025 | 01:14 AM