ఇంటర్ ఎలకా్ట్రనిక్స్ విభాగంలో స్టేట్ టాపర్కి మంత్రి అభినందన
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:28 AM
కాకినాడ రూరల్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): కాకినాడ పీఆర్ ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల విద్యార్థిని డి.సాయిలక్ష్మి ఎలకా్ట్రనిక్స్ విభాగంలో 1000కి 982 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. అమరావతిలో జరిగిన షైనింగ్ స్టార్స్-25 కార్యక్రమంలో ఆమెకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
కాకినాడ రూరల్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): కాకినాడ పీఆర్ ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల విద్యార్థిని డి.సాయిలక్ష్మి ఎలకా్ట్రనిక్స్ విభాగంలో 1000కి 982 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. అమరావతిలో జరిగిన షైనింగ్ స్టార్స్-25 కార్యక్రమంలో ఆమెకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బంగారు పతకం, ల్యాప్టాప్ అందజే శారు. సాయిలక్ష్మి, ఆమె తల్లిదండ్రులను సత్కరించారు. భవిష్యత్తులో ఏమవు దామునుకుం టున్నావని ఆ విద్యార్థినిని లోకేశ్ అడగ్గా డిగ్రీ పూర్తి చేసి గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేరవుతానని తెలిపింది. ఆమెను ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుందని ప్రిన్సిపాల్ తిరుపతి రెడ్డి తెలిపారు. సాయిలక్ష్మిని ఇంటర్మీడియట్ బోర్డు కమిషనరు కృతికా శుక్లా, కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు, కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారులు పీవీ శివప్రసాద్, నిరంజన్కుమార్ అభినందించారు.