Share News

ఖో-ఖో జాతీయ పోటీలకు ఎస్పీఎస్‌ విద్యార్థి

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:49 AM

ఎస్పీఎస్‌ మున్సిపల్‌ ప్లస్‌ పాఠశాలకు చెందిన డి.కృష్ణవేణి రాష్ట్రజట్టుకు ఎంపికైందని ఖో-ఖో కోచ్‌ మడకా ప్రసా ద్‌ తెలిపారు.

ఖో-ఖో జాతీయ పోటీలకు ఎస్పీఎస్‌ విద్యార్థి
రాష్ట్రజట్టుకు ఎంపికైన కృష్ణవేణిని అభినందిస్తున్న మడకా ప్రసాద్‌

గుడివాడ, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ఇటీవల చిత్తూరు జిల్లా పుత్తూరులో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఖో-ఖో అండర్‌-19 రాష్ట్ర పోటీల్లో ఎస్పీఎస్‌ మున్సిపల్‌ ప్లస్‌ పాఠశాలకు చెందిన డి.కృష్ణవేణి అత్యంత ప్రతిభ కనబరచి రాష్ట్రజట్టుకు ఎంపికైందని ఖో-ఖో కోచ్‌ మడకా ప్రసా ద్‌ తెలిపారు. గురువారం పాఠశాల ఆవరణలో కృష్ణవేణిని ఆయన అభినందించారు. ఈ నెల 30 నుంచి మే 4 వరకు నిర్వహించే జాతీ య పోటీల్లో రాష్ట్రజట్టు తరఫున ఆడుతుందన్నా రు. కృష్ణవేణిని ఖో-ఖో సంఘం జిల్లా చైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావు, కార్యదర్శి మద్దినేని సత్యప్రసాద్‌, డీసీపీ జిల్లా కార్యదర్శి షేక్‌ జాన్‌సాహెబ్‌, విద్యాకమిటీ చైర్మన్‌ తేలు శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయుడు వై.శ్రీనివాసరావు అభినందించారు.

Updated Date - Apr 25 , 2025 | 12:49 AM