CM Chandrababu Requests: 16వ ఆర్థిక సంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని అండగా నిలవాలని సీఎం కోరారు.
Amaravati CRDA Tenders: రాజధానిలో ఐదు టవర్ల నిర్మాణానికి సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. ఈ 5 టవర్లను రూ.4,668 కోట్ల వ్యయంతో చేపట్టాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
AP Liquor Scam: లిక్కర్ స్కామ్కు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒకరోజు ముందే సిట్ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఈ మేరకు సిట్కు సమాచారం అందించారు మాజీ ఎంపీ.
ఏపీ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు.. వీడియో ప్రదర్శించి 16వ ఆర్థిక సంఘం బృందానికి సీఎం చంద్రబాబు వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయం వంటి అంశాలపై ఫైనాన్స్ కమిషన్ బృందానికి ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలను వివరించారు.
AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్కు సంబంధించి సర్కార్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. వైసీపీ నేతలు చెప్పిన వారినందరినీ గతంలో అప్పటి యాజమాన్యం ఫైబర్ నెట్లో చేర్చుకుంది.
Amaravati Development Plan: రాజధానికి భూములిచ్చిన రైతులు అపోహ పడాల్సిన పనేం లేదని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్తో మూడేళ్లలో అమరావతి నిర్మణాన్ని పూర్తి చేస్తామన్నారు.
రాష్ట్రంలో 16వ ఆర్థిక సంఘం సభ్యులు బుధవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు పర్యటించనున్నారు. ఈ బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇతర అనేక అంశాలపై ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత విజయవాడలో వివిధ పార్టీల ప్రతినిధులతో ఆర్థిక సంఘం సభ్యులు మాట్లాడతారు.
విద్యార్థినులు నైపుణ్యాలు పెంచుకుంటే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మారిస్ స్టెల్లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ జసింత క్వాడ్రస్ అన్నారు.
ఆటోమొబైల్ రంగంలో ఊహించని మార్పులు వస్తున్నాయని, మెకానిక్లు వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని ఆటోనగర్ మెకానిక్ల సంఘం అధ్యక్షుడు గంధం వెంకటేశ్వరరావు తెలిపారు.
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై దారుణం చోటు చేసుకుంది. వివాహానికి వెళ్తూ.. మార్గమధ్యలో విజయవాడలో కొలువు తీరిన దుర్గమ్మను దర్శించుకొనేందుకు కారును పక్కన నిలిపి.. దర్శనానికి వెళ్లారు. కారులోని 25 కాసుల బంగారం మాయమైంది. దీంతో వారంతా లబోదిబోమంటున్నారు.ఇక సీసీ కెమెరాలు సైతం పని చేయక పోవడం గమనార్హం.