Share News

మంత్రాలయంలో భక్తుల కోలాహలం

ABN , Publish Date - Apr 21 , 2025 | 01:23 AM

ప్రముఖ పుణ్యక్షేత్ర మైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో కోలాహలంగా మారింది.

మంత్రాలయంలో భక్తుల కోలాహలం
భక్తులతో కిటకిటలాడుతున్న మఠం ప్రాంగణం

మంత్రాలయం, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్ర మైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో కోలాహలంగా మారింది. ఆదివారం సెలవు దినం కావటంతో దక్షణాది రాష్ర్టాలనుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగాణం భక్తులతో కిక్కిరిసింది. వేలాది మంది భక్తులు రావడంతో మఠం అతిథిగృహాలు, ప్రైవేట్‌ లాడ్జిలు భక్తులతో నిండిపోయాయి. అద్దె రూములు దొరక్క మధ్వమార్గ్‌ కారిడార్‌ ముందే భక్తులు బసచేశారు. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, ప్రధాన రహాదారులు, రాఘవేంద్ర సర్కిల్‌, నదితీరం భక్తులతో కోలాహాలంగా మారింది. గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. క్యూలైనన్లు, పరిమళ ప్రసాదం వద్ద భక్తుల సందడిగా మారింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీమఠం అధికారులు ఏఏఓ మాధవశెట్టి, మేనేజరు వెంకటేష్‌ జోషి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. సొంత వాహనాల్లో వచ్చిన భక్తులు ప్రధాన రహదారిపై ఇరువైపులా పార్కింగ్‌ చేయడంతో ట్రాఫిక్‌ సమస్యతో భక్తులు, గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు.

Updated Date - Apr 21 , 2025 | 01:23 AM