Share News

ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించండి

ABN , Publish Date - Apr 17 , 2025 | 11:25 PM

ప్రజలు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ పిలుపునిచ్చారు.

ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించండి
ర్యాలీ ప్రారంభిస్తున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు క్రైం, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): ప్రజలు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం కర్నూలు ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్‌ వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కొండారెడ్డి బురుజు వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, రహదారి భద్రత, నిబంధనలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణకు హోర్డింగులతో పాటు స్టిక్కర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హెల్మెట్‌ను వినియోగిస్తే 60 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు హుశేన్‌పీరా, కృష్ణమోహన్‌, డీఎస్పీలు బాబు ప్రసాద్‌, భాస్కర్‌రావు, ప్రసాద్‌, సీఐలు మన్సూరుద్దీన్‌, తేజోమూర్తి, అబ్దుల్‌ గౌస్‌, ఆర్‌ఎస్‌ఐ హుశేన్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 11:25 PM