క్రీడాకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ABN , Publish Date - Feb 22 , 2025 | 11:54 PM
క్రీడాకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత
అట్టహాసంగా రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళల,
జూనియర్ బాలుర హ్యాండ్బాల్ పోటీలు ప్రారంభం
కర్నూలు స్పోర్ట్స్, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): క్రీడాకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. శనివారం స్థానిక అవుట్డోర్ స్టేడియంలో హ్యాండ్ బాల్ కర్నూలు డిస్ర్టిక్ట్ అసోసియేషన ఆధ్వర్యంలో 10వ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళల, జూనియర్ బాలుర హ్యాండ్ బాల్ పోటీలను సీఐడీ సర్కిల్ ఇన్సపెక్టర్ నగేష్, జిల్లా ఒలింపిక్ సంఘం సీఈవో విజయకుమార్, కార్యదర్శి శ్రీనివాసులు, రాయలసీమ యూనివర్సిటీ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివకిషోర్, జిల్లా హ్యాండ్ బాల్ సంఘం కార్యదర్శి డా.రుద్ర రెడ్డి సర్వీసెస్ హ్యాండ్బాల్ టీం కోచ కాసీంసాహేబ్, సీనియర్ హ్యాండ్బాల్ క్రీడాకారుడు మాధవరావుతో కలిసి ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడాకారుల సంక్షేమం కోసం స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లు మూడు శాతం పెంచిందన్నారు. సీఐడీ సర్కిల్ ఇన్సపెక్టర్ నగేష్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు కొంత సమయం క్రీడా సాధనకు కేటాయిస్తే మేటి క్రీడాకారులుగా రాణించవచ్చన్నారు. అంతకుముందు అతిథులు పతాకా విష్కరణ చేసి క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.