పౌష్టికాహారంతోనే తల్లీబిడ్డల ఆరోగ్యం
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:17 AM
పౌష్టికాహారంతోనే తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్ సూపర్వైజర్ రాగిణి వసంత తెలిపారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్నగర్ అంగన్వాడీ సెంటర్-3లో పక్షోత్సవాల్లో భాగంగా గర్భిణులు, బాలింతలతో సమావేశం ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించారు.
ఆదోని రూరల్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): పౌష్టికాహారంతోనే తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్ సూపర్వైజర్ రాగిణి వసంత తెలిపారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్నగర్ అంగన్వాడీ సెంటర్-3లో పక్షోత్సవాల్లో భాగంగా గర్భిణులు, బాలింతలతో సమావేశం ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సక్రమంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త ఎం.పి. విమల, మహిళా పోలీసులు లక్ష్మీదేవి, హెల్పర్లు బాలమ్మ, నరసమ్మ, లక్ష్మీదేవి పాల్గొన్నారు.