ఇంకా వైఎస్సార్ పేరే
ABN , Publish Date - Apr 24 , 2025 | 10:47 PM
గ్రామీణ ప్రాంతాలలో వైద్య సదుపాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులతో గత వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ భారత్ నిర్మాణ్ సేవా కేంద్రం భవనాలను నిర్మించింది. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ పేరులో వైఎస్సార్ పేరును తొలగించి విలేజ్ హెల్త్ క్లినిక్గా మార్పు చేశారు.
విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలపై తొలగించని వైనం
ప్రభుత్వ ఆదేశాల అమలులో నిర్లక్ష్యం
అద్దంకి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంతాలలో వైద్య సదుపాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులతో గత వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ భారత్ నిర్మాణ్ సేవా కేంద్రం భవనాలను నిర్మించింది. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ పేరులో వైఎస్సార్ పేరును తొలగించి విలేజ్ హెల్త్ క్లినిక్గా మార్పు చేశారు. అయితే ఆ మార్పు రికార్డులకే మా త్రమే పరిమితం అ య్యిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలు విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలపై ఇంకా వైస్సార్ పేఉను తొలగించకపోవడం ఇందుకు నిదర్శనం. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా క్షేత్ర స్థాయిలో వాటి అమలులో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పసటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆయా భవనాలపై పేరు మార్పునకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.