Home » Andhra Pradesh » Prakasam
టీడీపీ హయాంలోనే మైనారిటీల అభివృద్ధి జరిగిందని టీడీపీ నాయకులు షేక్ మౌలాలి, పటాన్ ఇబ్రహీంఖాన్ స్పష్టం చేశారు.
మం డలంలోని గంజివారిపల్లె పంచాయటీలోని గాంధీనగర్, శాంతినగర్ గిరిజనగూడెంలో, చెన్నరాయునిపల్లె గ్రామంలో వైసీపీ పార్టీని వీడి మొత్తం 40 కు టుంబాలు టీడీపీలో చేరాయి.
ఒంగోలు నగర ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. ‘ఈ ఎన్నికల్లో గెలిపించండి.. నగరానికి ప్రతిరోజూ తాగునీరు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.’ ఇదీ గత ఇరవై ఏళ్లుగా ఒంగోలు ప్రజలకు వినిపిస్తున్న హామీ.
జిల్లాలోని టీడీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. వివిధ కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియడంతో అటు అభ్యర్థులు రోడ్షోలు, సభలు నిర్వహిస్తున్నారు.
జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 18,22,470 మందికి చేరింది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓట్ల నమోదు కోసం ఈనెల 16వ తేదీ వరకు ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చింది.
జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల పరిశీలన ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.
వచ్చే నెలలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో అర్హులంతా ఓటు హక్కును వినియోగించుకొనేలా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు.
టీడీపీ నేత, సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఈనెల 30న జిల్లాలో పర్యటించనున్నారు. కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గ్రామీణవాతావరణం తరహాలోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
కానిస్టేబుల్ వేణు ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత కూడా విధులకు గైర్హాజరు కావడంతో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ సీరియస్ అయ్యారు. అతనిపై ఎన్నికల కమిషన్కు నివేదిక పంపించారు. అతను ఈ నెల 3 నుంచి విధుల్లో లేడని, పోలీసుస్టేషన్ జనరల్ డైరీ ప్రకారం సింగరాయకొండ సీఐ రంగనాథ్ నివేదక ఇచ్చారు.