పోలియో నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం చుక్కల కార్యక్రమం నిర్వహిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వం బాలికల హైస్కూ ల్లో ఆదివారం చిన్నారులకు ఆయన చుక్కలు వేశారు.
రైతుల ఆర్థిక అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని తాడివారిపల్లిలో రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల కోర్కె అయిన మార్కాపురం జిల్లాను ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారన్నారు.
పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి తెలిపారు. ఆదివారం గిద్దలూరు రైల్వేస్టేషన్లో నిర్వహించిన పల్స్పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అశోక్రెడ్డి ప్రారంభించారు.
ఉపాధి హామీ పనులు (2014-19 మధ్య) చేసినా గత వైసీపీ ప్రభుత్వ వేధింపులు, కక్షసాధింపు చర్యలతో బిల్లులు రాక అప్పులపాలైన వారికి ఊరట లభించనుంది. ఆ పనుల నమోదుకు ప్రస్తుత ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది.
తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి విలువైన భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న వ్యవహారంలో మరిన్ని అక్రమాలు వెలుగు చూస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్ ద్వారా ఎంపిక చేసిన రంగాల్లో అభివృద్ధికి దేశవ్యాప్తంగా కొన్ని ఆకాంక్షిత మండలాలను (ఆస్పిరేషనల్ బ్లాక్) ఎంపిక చేసింది. అందులో రాష్ట్రంలోని 7 జిల్లాల్లో 15 మండలాలు ఉన్నాయి.
పరిశుభ్రతే లక్ష్యంగా శనివారం జిల్లా అంతటా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం కొనసాగింది. ఈసందర్భంగా పలు ప్రాంతాల్లో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడంతోపాటు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞలు చేయించారు.
జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్పోలియో జరగ నుంది. అందుకు అవసరమైన ఏర్పాట్లను వైద్యశాఖ పూర్తి చేసింది. చుక్కల మందుపై ప్రజలకు అవ గాహన కల్పిస్తూ జిల్లాకేంద్రంతోపాటు పీహెచ్సీల పరిధిలో శనివారం ర్యాలీలు, వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.
జిల్లాలో కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముందుగానే గ్రామపంచాయతీల విభజన ఉంటే ఆ ప్రక్రియను పూర్తిచేసి ప్రతిపాద నలను పంపాలని ఆదేశించింది.
అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒక ఆపన్న హస్తమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు. శనివారం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలో అనాఆరోగ్యంతో బాధపడుతున్న 53 మందికి రూ.40,16,410 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.