పేదల భూములను లాక్కున్నారు
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:59 PM
కేంద్రీయ విద్యాలయానికి అనుమతులే లేవని, కాని ఆ పేరుమీద సర్వే నెంబరు 51లో పేదల భూములు లాక్కున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆరో పించారు.
పలాస, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): కేంద్రీయ విద్యాలయానికి అను మతులే లేవని, కాని ఆ పేరుమీద సర్వే నెంబరు 51లో పేదల భూములు లాక్కున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆరో పించారు. ఈ మేరకు ఆదివారం చలో సూదికొండ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ ప్రాంతంలో టీడీపీ నాయకుల ఆక్రమ ణలో ఉన్న భూములు అమ్మారని, వాటిని పేదలు కొనుగోలు చేస్తే ఆ భూములను ఆక్రమ ణల పేరుతో తొలగించా రని, మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని విమర్శించారు. క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించగా ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. ఆయన వెంట వైసీపీ నాయకులు పాల్గొనగా భూములు కోల్పోయిన వారు నామమా త్రంగా హాజరవడం చర్చనీయాంశంగా మారింది.