లక్ష్యసాధనకు కృషి చేయాలి: ప్రభుత్వ విప్
ABN , Publish Date - Apr 22 , 2025 | 11:57 PM
ప్రతికూల పరిస్థితుల్లో సైతం లక్ష్యాల సాధనకు ప్రతీ ఒక్కరూ కృషిచేయాలని ప్రభుత్వవిప్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ కోరారు. మంగళ వారం మండలంలోని కొండపోలేరు ప్రాథమిక పాఠశాల ఆవరణలో గ్రామపెద్దలు కప్ప హరికృష్ణ, రాములమ్మ దంపతులు నిర్మించిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
కంచిలి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ప్రతికూల పరిస్థితుల్లో సైతం లక్ష్యాల సాధనకు ప్రతీ ఒక్కరూ కృషిచేయాలని ప్రభుత్వవిప్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ కోరారు. మంగళ వారం మండలంలోని కొండపోలేరు ప్రాథమిక పాఠశాల ఆవరణలో గ్రామపెద్దలు కప్ప హరికృష్ణ, రాములమ్మ దంపతులు నిర్మించిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూరాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతోందనితెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో శివరాంప్రసాద్, నాయకులు బంగారు కురయ్య, మాదిన రామారావు, జగదీష్ పట్నాయక్, ఎం.పూర్ణ, హెచ్ఎం జగదీశ్వరరావు, మద్దిల కేశవరావు, టీవీ రమణ పాల్గొన్నారు.