దాడితల్లికి లక్ష మంత్రాలతో కుంకుమార్చన
ABN , Publish Date - Apr 18 , 2025 | 11:55 PM
బొబ్బిలి పట్టణంలోని గొల్లపల్లి బైపాస్ జంక్షన్లో గల దాడితల్లి ఆలయంలో శుక్రవారం లక్ష మంత్రాలతో అమ్మవారికి కుంకుమా ర్చన పూజలు చేశారు.
బొబ్బిలి, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి పట్టణంలోని గొల్లపల్లి బైపాస్ జంక్షన్లో గల దాడితల్లి ఆలయంలో శుక్రవారం లక్ష మంత్రాలతో అమ్మవారికి కుంకుమా ర్చన పూజలు చేశారు. వచ్చే నెల 4 నుంచి మూడురోజుల పాటు అమ్మవారి సిరిమానో త్సవం జరగనున్న నేపథ్యంలో ఆలయం లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయ అర్చకుడు పిండిప్రోలు మణికుమార్శర్మ ఆధ్వర్యంలో ఆయన శిష్యబృందం అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. ఈ పూజలో వినియోగించిన కుంకుమ ను, గాజులను భక్తులకు గ్రామదేవత పండగ రోజున అందజేస్తామని ఆయన తెలిపారు.