The Same Exploitation Continues Even Now! జిల్లాలో కొమరాడ మండలం ఇసుకాసురలకు అడ్డాగా మారింది. కోనేరు రామభద్రపురం గ్రామ సమీపంలోని నాగావళి నది వద్ద మళ్లీ ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ రవాణా సాగించిన వారే ఈ దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఉన్నట్లు సమాచారం.
No Bills, How Will Meals Be Served? జిల్లాలో గిరిజన విద్యాలయాలకు గత రెండు నెలలుగా మెస్ బిల్లులు మంజూరు కావడం లేదు. దీంతో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందడం లేదు. మరోవైపు వసతి గృహ సంక్షేమా ధికారులు అప్పులతో కాలం నెట్టుకొస్తున్నారు.
Manyam mustabhu… Now the Whole State! విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ‘ముస్తాబు’ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మదిని దోచిన సంగతి తెలిసిందే. కాగా ఆయన ఆదేశాలతో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ‘ముస్తాబు’కు శ్రీకారం చుట్టారు.
Who Knows What Happened? వారికి పెళ్లయి రెండు నెలలు కూడా కాలేదు. ఇంకా వారి కుటుంబాల్లో పెళ్లి ముచ్చట కూడా తీరలేదు. ఇంతలో ఘోరం జరిగిపోయింది. కోటి ఆశలతో నూతన జీవితంలోకి అడుగుపెట్టిన ఆ దంపతులిద్దరూ 56 రోజులకే విగతజీవులయ్యారు. రైలు నుంచి పడి గరుగుబిల్లి మండలంలోని రావుపల్లి గ్రామానికి చెందిన నవదంపతులు కోరాడ సింహాచలం (25), భవాని (19) మృతి చెందారు.
Empty Chairs, Where Is the Staff? భూముల రీ సర్వేకు సంబంధించి క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు కీలక శాఖలకు చెందిన సిబ్బంది హాజరు కావడం లేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
Environmental cleanliness is a moral responsibility పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతీ ఒక్కరి నైతిక బాధ్యత అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ కళశాల)లో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యకమ్రంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Talent can excellent పోలీసు శాఖలో మంచి ప్రతిభ కనబరిస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చునని, సాధించినది కానిస్టేబుల్ ఉద్యోగమేనన్న నిరాశ వద్దని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు.
Why not take it?స్మార్ట్ కార్డు చాలా కీలకం. ప్రభుత్వం రేషన్కే పరిమితం కాకుండా ఏ పథకం పొందాలన్నా ఈ కార్డునే ప్రాతిపదికగా తీసుకుంటోంది. అంత ముఖ్యమైన కార్డులు జారీ చేసి నెలల గడుస్తున్నా తీసుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా వేలల్లోనే డీలర్ల వద్ద మూలుగుతున్నాయి. ఎందుకు తీసుకోలేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీనిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
sad situation in farmers రాజాం మండల రైతులు వారం రోజుల కిందటే బస్తాల్లోకి ధాన్యం ఎత్తి అమ్మకానికి సిద్ధం చేశారు. రైతుసేవా కేంద్రం సిబ్బంది పరిశీలించి ట్రక్షీట్లు జనరేట్ చేయాలి. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో రోజులకొద్దీ ధాన్యం బస్తాలు కల్లాల్లోనే ఉండిపోతున్నాయి.
నగరంలోని వన్టౌన్ పోలీ సు స్టేషన్ పరిధిలో 2024లో నమోదైన రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడు నగరంలోని వీటీ అగ్రహారానికి చెందిన నక్కా గణేష్కు విజయనగరం స్పెషల్ మొబైల్ కోర్టు రెండో అడిషనల్ సివిల్ న్యాయాధికారి పి.బుజ్జెమ్మ రూ.14వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్టు వన్టౌన్ సీఐ ఆర్వీఆర్కే చౌదరి తెలిపారు.