పట్టణంలోని బీపీ కాలనీ (బద్దెప్రసాద్ కాలనీ)కి చెందిన విద్యార్థి తీడ వే దాంత కార్తికేయ (16) మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మండలంలోని అన్నంరాజుపేట గ్రామానికి చెందిన ఒక యువకుడు తల్లిదండ్రులను భయపెట్టాలని బుధవారం పురుగు మందు తాగాడు.
‘జిల్లాలో వైద్య ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టండి. ఎక్కడా సీజనల్ వ్యాధులు, డయేరియా వంటి మాట వినిపించకూడదు. గుర్ల డయేరియా ఘటన దృష్ట్యా మరోసారి అటువంటి వాటికి అవకాశం ఇవ్వద్దు’’ సీఎం చంద్రబాబు జిల్లా యంత్రాంగానికి చేసిన హెచ్చరికలు ఇవి. జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అలాగే ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రుల పనితీరు మెరుగుపడడం లేదు. ఇప్పటికీ చాలా ఆస్పత్రులకు సాయంత్రం 5 గంటలు దాటితే తాళాలు పడుతున్నాయి. వైద్యులు, సిబ్బంది సరిగా అందుబాటులో ఉండడం లేదు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున ఆయన విగ్రహానికి మాజీ ఉప ముఖ్యమంత్రులు పూలమాల వేసి, తనను తిట్టడ మే ధ్యేయంగా పెట్టుకున్నారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు.
ఉమ్మడి జిల్లాలో వందకుపైగా కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. చాలావాటికి అనుమతుల విషయంలో అనేక అనుమానాలున్నాయి. భవన నిర్మాణాల నుంచి విద్యార్థులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాల వరకు అన్నింటా నిర్లక్ష్యం కనిపిస్తోంది.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బొబ్బిలి వీణను అయోధ్యలోని శ్రీరామ మందిరానికి బహూకరించనున్నట్లు ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు.
మండల కేంద్రంలో 15 రోజులుగా తాగునీరు లేక దళితులు ఇబ్బంది పడుతున్నారని సీపీఎం నాయకుడు కె.సాంబమూర్తి అన్నారు.
What about those 47 acres? విజయనగరం రాజుల కాలంలో ధర్మవరంలో నిర్మితమైన చెన్నకేశవస్వామి ఆలయం అంటే ఎస్.కోట చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలియని వారుండరు. ఈ ఆలయానికి ఎంతో వైభవం ఉండేది. ఆలయ నిర్వహణకు అప్పట్లో రాజులు 141 ఎకరాలు ఇచ్చారు. వాటిపై వచ్చే ఆదాయంతో స్వామికి ధూపదీప నైవేద్యాలు.. అభిషేకాలు.. యజ్ఞాలు.. పురోహితులకు వేతనాలు దక్కేవి. కాలక్రమంలో స్వామికే దయనీయ పరిస్థితి తలెత్తింది. ఆలయ భూములను వివాదాలు చుట్టుముట్టాయి. కోర్టు కేసుల్లో 53 ఎకరాలుంది. 47 ఎకరాల సంగతేంటో అంతు చిక్కడం లేదు. ఎవరెవరి ఆక్రమణలో ఉన్నాయో అధికారులు తేల్చడం లేదు. ఆఖరికి అంత పేరున్న ఆలయంలో అర్చకులకు ఐదేళ్లుగా వేతనాలు అందడం లేదు.
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు.బుధవారం చిలకపాలెంలో పబ్లిక్ గ్రీవెన్స్లో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
Work is Done… But Where Are the Wages? జిల్లాలో ఉపాధి వేతనదారులు ఆకలితో అల మటిస్తున్నారు. గత కొద్ది నెలలుగా వారికి వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పనుల ప్రదేశంలో పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించడం లేదు. చాలాచోట్ల నిలువ నీడ కొరవడడంతో వేతనదారులు నానా అవస్థలు పడుతున్నారు.