Share News

పనులు కల్పించాలి

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:01 AM

జాబ్‌ కార్డు కలిగిన ప్రతిఒక్కరికీ ఉపాధి పనులు కల్పించాలని కోరుతూ మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట పెదపెంకి గ్రామస్థులు ఆందోళన చేశారు.

పనులు కల్పించాలి
ఆందోళన చేస్తున్న ఉపాధి వేతనదారులు

బలిజిపేట, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): జాబ్‌ కార్డు కలిగిన ప్రతిఒక్కరికీ ఉపాధి పనులు కల్పించాలని కోరుతూ మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట పెదపెంకి గ్రామస్థులు ఆందోళన చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లోనూ ఉపాధి పనులు నిర్వహిస్తు న్నప్పటికీ పెదపెంకి గ్రామంలో కొంతమందికే పనులు కల్పించారని, దీనివల్ల అర్హులైన వారు పని లేక ఇబ్బంది పడుతున్నారు. అర్హులందరికీ పనులు కల్పించాలని, చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని, పనిచేసిన చోట మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌ను రద్దు చేయాలని, రోజుకు ఒక పూట పని కల్పించాలని కోరారు. అనంతరం ఎంపీడీవో నగేష్‌కు, ఉపాధిహామీ ఏపీవో రావుకు వినతిపత్రం అందజేశారు.

Updated Date - Apr 23 , 2025 | 12:01 AM